ఆ కంపెనీలపై ఈడీ సోదాలు.. లాకర్లు తెరిచి చూసి షాక్..!

-

బ్యాంకులను మోసం చేసి రూ.వేల కోట్ల రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో పలు కంపెనీలపై ఈడీ సోదాలు జరిపింది. ఈ క్రమంలో ఆ కంపెనీల లాకర్లు తెరిచి చూసి ఈడీ అధికారులు షాకయ్యారు. ఇంతకీ అందులో ఏం ఉందంటే..?

పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్లు రుణం తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలపై 2018లో ఆ కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ కంపెనీలపై తాజాగా ఈడీ సోదాలు జరపగా.. రక్షా బులియన్‌ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మొత్తం 761 లాకర్లు ఉండగా.. మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ మూడు లాకర్లను తెరవగా రెండు లాకర్లలో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188కిలోల వెండి (మొత్తంగా 340 కిలోలు) ఉందని వివరించారు. వీటి విలువ రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news