నేడు బాసర ఆర్జీయూకేటీకి మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్నారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

జిల్లాల పర్యటనలో భాగంగా కేటీఆర్.. ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్​లో జైనథ్​ మండలం దీపాయిగూడకు చేరుకుంటారు. అక్కడ మాతృవియోగం బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్​లోని బీజీఎన్చీ డేటా సొల్యూషన్స్​ సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత నిర్మల్​ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో కేటీఆర్​ భేటీ అవుతారు. ఆనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు.

ట్రిపుల్ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా కేటీఆర్​ను తీసుకువస్తానని చెప్పారు. ఆ హామీ మేరకు కేటీఆర్​తో కలిసి.. సబితా ఇంద్రారెడ్డి ఆర్టీయూకేటీకి వెళ్లనున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలన్ని పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news