IND VS AUS : రామ్‌ చరణ్‌ ఇంటికి టీంఇండియా క్రికెటర్స్‌

-

ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

అయితే… మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ ప్లేయర్స్ కొందరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. దీంతో వారు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

‘మ్యాన్ ఆఫ్ మాసేస్ రామ్ చరణ్ ఇంటికి భారత క్రికెటర్స్ వచ్చారు, ఇది రామ్ చరణ్ క్రేజ్’ అంటూ ఒకటే ట్వీట్స్. ఈ ట్వీట్స్ తో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మ్యాచ్ అనంతరం రామ్ చరణ్ ను కలిసేందుకు, ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news