IND Vs SA : రేపటి నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్..పాండ్యా ఔట్

-

IND VS AUS : రాబోయే టి20 వరల్డ్ కప్ కు ముందు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టి20 ల సిరీస్ ను 2-1 తో గెలిచిన టీమిండియా, సౌత్ ఆఫ్రికా తో సమరానికి సిద్ధమవుతోంది. బుధవారం తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

కాగా ఈ సిరీస్ కోసం టీమిండియాలో టీమ్ మేనేజ్మెంట్ కీలక మార్పు చేసినట్లు సమాచారం. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని స్థానంలో ఆర్సిబి ఆటగాడు షాబాజ్ అహ్మద్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే షాబాజ్ కు అవకాశం ఇవ్వనున్నారు. ఇటీవల జింబాబ్వే తో జరిగిన మూడు వన్డేల సిరీస్ కు కూడా షాబాజ్ ఎంపికయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news