వదిన సమంతకు మద్దతుగా అక్కినేని అఖిల్..!

-

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సమంత ఇటీవల అనారోగ్యానికి గురైన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తనకు మయో సిటీస్ అనే వ్యాధి వచ్చిందని, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు , అభిమానులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఎంత విడాకులు తీసుకున్న సరే ఒకరి ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు తప్పకుండా తమ జీవిత భాగస్వామి స్పందించాల్సి ఉంటుంది. కానీ నాగచైతన్య ఈ విషయంపై అసలు స్పందించకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . మరొకవైపు అక్కినేని ఫ్యామిలీ నుంచి అటు అమల, ఇటు నాగచైతన్య, నాగార్జున ఎవరు కూడా స్పందించలేదు.

విశేషంగా అఖిల్ అక్కినేని స్పందించడంతో సమంత అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ఆమె ఏదో సర్జరీ చేయించుకుందని, అందుకే ఫేస్ అలా మారిపోయిందని పుకార్లు కూడా షికారులు చేశాయి. ఈ క్రమంలోనే సమంత అసలు విషయం చెప్పి అభిమానులతో పాటు ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చింది. తనకు మయో సిటీస్ అనే వ్యాధి సోకిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకోవాలని అనుకుంటున్నాను.. కానీ ఇంకా సమయం పట్టేలా ఉందంటూ ఎమోషనల్ అవుతూ ట్వీట్ షేర్ చేసింది సమంత.

ఈ విషయంపై అక్కినేని ఆమె మాజీ మరిది స్పందిస్తూ.. సానుభూతి తెలియజేశాడు. “అందరి ప్రేమాభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్” అంటూ ట్రీట్ చేశాడు అక్కినేని అఖిల్. అయితే నాగార్జున, నాగచైతన్య ఎవరు కూడా స్పందించక ముందే అఖిల్ స్పందించడంతో అభిమానుల సైతం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CkSvgOOLV-Z/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news