న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు సుదూరంగా ఉన్న హిమాలయాల మధ్య ఇలా జరుపుకోండి..!

-

కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా జరుపుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యచ్చు. న్యూ ఇయర్ ని కాస్త కొత్తగా జరుపుకోవాలంటే ఈ ప్రాంతానికి వెళ్ళచ్చు. వివరాలని చూస్తే… గుషాయిని లో మంచిగా ఈసారి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవచ్చు.

ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయ పర్వతాల చెంత తిర్థన్ నది ఒడ్డున వుంది. ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది. ఎంతో చల్లగా ఈ ప్రాంతం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు తెగ నచ్చేస్తుంది. ఇక్కడ ఇల్లులన్నీ కూడా చెక్కలతో నిర్మించారు. ఎత్తైన పర్వతాలు, దట్టమైన చెట్లు ఎంతో బాగా ఆకట్టుకుంటాయి. పైగా నదీ జలాలు ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటాయి.

గుషాయిని తీర్థన్ లోయలో ఉన్న ఈ గ్రామం లో న్యూ ఇయర్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ కూడా వుంది. ట్రెక్కింగ్ ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ ఎంజాయ్ చెయ్యచ్చు. ట్రెక్కింగ్ ఇక్కడ నుండే మొదలు అవుతుంది. తీర్థన్, ఫ్లాచన్ నది కలిసే ప్లేస్ మరెంత బాగుంటుంది. గహిదర్ వద్దనైతే రహస్య జలపాతం ఉంటుంది అక్కడకి కూడా మీరు వెళ్ళచ్చు. అలానే యాంగ్లింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచింగ్ వంటివి కూడా మీరు ఎంజాయ్ చేసేయచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news