ఖమ్మంలో కేసీఅర్ BRS సభ తో VRS ఇస్తారు – రేణుకా చౌదరి

-

ఖమ్మంలో కేసీఅర్ BRS సభ తో VRS ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రేణుకా చౌదరి. కేసీఅర్ కు హెచ్చరిక …ఖమ్మం జిల్లా మీ మంత్రి దోపిడీ…దొంగతనలు తెలియడం లేదా? అక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు రేణుక చౌదరి. బిజెపి ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తుందని కేసీఅర్ అంటున్నారు.. మరి ఖమ్మం జిల్లాలో ఆరు మంది ఎమ్మెల్యే లు… కేసీఆర్ సత్య నారాయణ వ్రతం చేసి ప్రసాదం ఇస్తే వచ్చారా ? అని నిలదీశారు.

జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు..రాబోయే రోజుల్లో కేసీఅర్ కరెంట్ షాక్ ఇస్తారని తెలిపారు. తెలంగాణ ను కేసీఅర్ సర్వ నాశనం చేశారు..ఈ కొత్త సంవత్సరంలో కేసీఅర్ నిజాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు అనుకుంటున్నాని తెలిపారు రేణుక చౌదరి. కేసీఅర్ తెలంగాణ పై అమోఘమైన వ్యామోహం చూపిస్తున్నారు..ఇప్పుడు దేశంలో కేసీఅర్ కు తాలిబాన్ గుర్తుకు వచ్చిందని చురకలు అంటించారు. మోడీకి అన్ని రకాల మద్దతు ఇచ్చారు కేసీఅర్ …ట్రిపుల్ తలక్ కు కేసీఅర్ మద్దతు ఇచ్చారని ఫైర్ అయ్యారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news