రేపు సంక్రాంతి సంబరాలు చేసుకోనున్న జగన్ దంపతులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి సంక్రాంతి సంబరాలు. ఇక రేపు తన నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా సతీసమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు ఏపీ సీఎం జగన్. దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర పురుడు పోసుకున్న పల్లె వాతావరణం నెలకొంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపాలు, తెలుగు తనం, పల్లె పట్టు వాతావరణం కనువిందు చేస్తున్నాయి. ముద్ద బంతులు, చామంతులు, పాడి పంటలతో సంక్రాంతి సోయగం సంతరించుకుంది ముఖ్యమంత్రి గోశాల. ఇక రేపు సతీసమేతంగా గోపూజ అనంతరం భోగి మంటలు, సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నారు. ఉదయం పది గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news