మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి నోటీసులు జారీ.?

-

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కేవలం బాలీవుడ్ సినీ ప్రేక్షకులకి మాత్రమే కాదు సౌత్ సినీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె సౌత్ సినీ భాషలలో కూడా నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. తన అందచందాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఆ కాలంలోనే చలామణి అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తమిళ్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందిని పాత్రలో నటించి మరోసారి పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పుడు అజిత్ 62వ చిత్రంలో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా.. ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అదేమిటంటే రెవెన్యూ అధికారులు ఐశ్వర్య రాయ్ కి నోటీసులు జారీ చేశారు అని సమాచారం. సిన్నర్ లోని ఒక భూమికి సంబంధించి ఐశ్వర్య ట్యాక్స్ కట్టకపోవడంతో వారు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దాదాపుగా ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ చెల్లించకపోవడంతో ఇప్పుడు ఈ విధంగా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు మరో 1200 మంది కూడా టాక్స్ లు కట్టకపోవడంతో వారికి కూడా నోటీసులు అందినట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ నోటీసులు అందుకున్న వారిలో బడా కంపెనీలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా టాక్స్ లు ఎగ్గొట్టడంతో ప్రభుత్వానికి రావలసిన రూ.1.11కోట్లు నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది. మార్చిలోపు కట్టకుండా ఉన్న ట్యాక్స్ లు క్లియర్ చేయాలని.. వారికి నోటీసులు జారీ చేశారు ఇకపోతే ఐశ్వర్యరాయ్ మొత్తంగా రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉంది అని తెలుస్తోంది. పది రోజులలోపు చెల్లించకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం 1996 లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యరాయ్ పై చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news