సావిత్రి గారి ఇంటితో ఎమోషనల్ సెంటిమెంట్ ఉంది.. లలిత జ్యువెలర్స్ MD..!

-

“డబ్బులు ఎవరికి ఊరికే రావు” అనే డైలాగుతో తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్. తన బ్రాండ్ కు తానే అంబాసిడర్ గా వ్యవహరించి లలిత జ్యువెలరీ ఆభరణాలను ప్రమోట్ చేస్తూ వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వేల కోట్లకు అధిపతి అయిన ఈయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.. ఇకపోతే తాను వ్యాపారవేత్తగా ఇంత సక్సెస్ కావడానికి కారణం మహానటి సావిత్రి అని.. తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని.. ఆమె వల్ల తాను సక్సెస్ అయ్యానని తెలిపారు.

ఇకపోతే కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సావిత్రి గారి ఇంటితో నాకు ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నాను. సావిత్రి పేరుమీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. అక్కడ షాప్ రెంటుకు తీసుకొని బంగారం షాపు మొదలు పెట్టాను . సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే నా వ్యాపారం బాగా నడిచింది. ఇప్పుడు నేను ఇంత పెద్ద సక్సెస్ అయ్యాను అంటే దానికి కారణం ఆమె. ఆ ఇంటి పేరు ఇప్పటికీ ఆమెదే అని తెలిపారు.

చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించాను. ఇకపోతే ఆ బిల్డింగ్ పైన లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము. కానీ సావిత్రి గణేషన్ అనే పేరు మాత్రం అలాగే ఉంచాము అంటూ తెలిపారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని కిరణ్ కుమార్ అక్కయ్య అని ఆప్యాయతగా పిలుస్తారట. అలా వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news