వివేక హత్య కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు – అవినాష్ రెడ్డి

-

వివేక హత్య కేసు కు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. సీబీఐ నోటీసుల పై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి…గత రెండున్నర సంవత్సరాలుగా నాపై , నా కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహించారు.

నాపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్న…నేనేమిటో నా వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ బాగా తెలుసు అన్నారు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలా అన్నదే నా ధ్యేయం..మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం తేలాలని నేను కూడా భగవంతుడు ని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండన్నారు అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news