విమానం ఆలస్యం.. అసహనంతో హైజాక్ అంటూ ట్వీట్.. చివరకు..

-

కొన్నిసార్లు ఆవేశంలో చేసే పనులు మనకు చాలా ముప్పు తెచ్చిపెడుతుంటాయి. అసహనంతో ఓ వ్యక్తి తాను చేసిన పనికి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

విమానం ఆలస్యం అయిందని అసహనానికి గురై ‘విమానం హైజాక్‌’ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ అతడ్ని కటకటాలపాలు చేసింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి జైపుర్‌ వస్తున్న విమానంలో రాజస్థాన్‌కు చెందిన మోతీ సింగ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. జైపుర్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ విమానాన్ని దిల్లీకి మళ్లించారు.

దిల్లీకి 9:45కు చేరుకున్న విమానం 1:40కి జైపుర్‌కు బయలుదేరింది. ఈ మధ్యలో అసహనానికి గురైన మోతీసింగ్‌ ‘విమానం హైజాక్‌’ అని ట్వీట్‌ చేశాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని లగేజీతో సహా కిందకి దించేసి పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news