నామినేషన్ దాఖలు చేసిన BRS ఎమ్మెల్సీ అభ్యర్థులు

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు అయిన దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్‌ రామిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. వీరు ముగ్గురు కాసేపటి క్రితమే అసెంబ్లీ చేరుకుని.. నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి.. బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలు హాజరు అయ్యారు.

కాగా, ఈ ఏడాదితో శాసనమండలిలో గాంగాధర్​ గౌడ్​, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుండడంతో..ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది.నేటి నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్వీకరించిన నామినేషన్లను 14వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఉపసంహరించుకున్న నామినేషన్ల తర్వాత వారం రోజుల సమయంలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్​ జరగనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ నిర్వహించి.. అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news