AP News : కాసేపట్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. అమల్లో నిమిషం నిబంధన

-

ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలనుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ఏపీ ఇంటర్‌ విద్యామండలి టోల్‌ఫ్రీ నంబరు 18004257635 ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,03,990మంది పరీక్షలు రాయనున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు 4,84,197, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను తమ తల్లిదండ్రులు కేంద్రాల వద్ద విడిచిపెడుతున్నారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news