BIG BREAKING : తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు

-

TSPSC పేపర్ లీకేజీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇంకోవైపు ఈ ఘటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు పిలుపునిచ్చారు.

ఈ తరుణంలో.. టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్నయం తీసుకుంది. తాజాగా తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు చేసింది TSPSC. వరుసగా పరీక్షలను రద్దు చేస్తున్న టీఎస్పీఎస్సీ… జూనియర్‌ లెక్టరర్‌ పోస్టు పరీక్షలను కూడా రద్దు చేసింది. దీంతోపాటు ఏఈఈ, డిఏఓ పరీక్షలను సైతం రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేసిన TSPSC… కొత్త పరీక్ష తేదీని ప్రకటించింది. జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు పలు పరీక్షలను TSPSC రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news