ఏప్రిల్ 17 నుండి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

-

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. పిఆర్సి అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వాలని బుధవారం ఇంజనీర్స్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు.

విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందున వేతనాలను 6% మాత్రమే పెంచగలమని సీఎండీలు స్పష్టం చేశారు. వేతన సవరణ పై నియమించిన కమిటీ 5% పెంపును మాత్రమే సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా తాము ఇంతకుముందు కోరినట్లుగా 30% పెంచాల్సిందేనని అన్ని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే ఆరు శాతానికి మించి పెంచలేమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెకు దిగాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

Read more RELATED
Recommended to you

Latest news