గన్నవరం ఎయిర్ పోర్టులో రజనీకాంత్ కు స్వాగతం పలికిన బాలయ్య

-

నేడు విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. నెల రోజుల పాటు 100 ప్రాంతాల్లో 100 వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక చేసింది తెలుగు దేశం పార్టీ. ఈ తరుణంలోనే, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఇవాళ రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు.పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్, బాలయ్య, చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.

ఇందులో భాగంగానే.. గన్నవరం ఎయిర్ పోర్టులో రజనీకాంత్ కు స్వాగతం పలి కారు బాలయ్య. బాలయ్యను చూడగానే ఆత్మీయ ఆలింగనం  చేసు కున్న రజనీకాంత్…ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు రజనీకాంత్-బాలయ్య. ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లిన రజనీకాంత్ – బాలయ్య… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతఙతలు తెలిపారు బాలయ్య. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అం టూ వ్యాఖ్యానించారు రజనీకాంత్.
రజనీకాంత్ తో హోటల్లో కాసేపు భేటీ అయిన బాల య్య.. అనంతరం వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news