BREAKING : కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

BREAKING : డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం అయింది. కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ఛాంబర్‌ కూర్చున్నారు.

కాగా, తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగుల వాహనాలను లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. దీంతో ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు మాత్రం లోపల పార్కింగ్ ఫుల్ అయిందని.. నడిచి వెళ్లాలని ఉద్యోగులకు సూచించారు. దీంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news