సమ్మర్ స్పెషల్.. 380 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే శాఖ

-

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది సొంతూళ్లకు బయల్దేరతారు. లేదా ఏదైనా వెకేషన్​కు వెళ్లాలనుకుంటారు. కాస్త డబ్బున్నవారైతే విమానాల్లో ప్రయాణిస్తారు. అదే మధ్య తరగతి వాళ్లైతే వెకేషన్ కూడా తమ బడ్జెట్​లో ప్లాన్ చేస్తారు. అందుకే వారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇలా సమ్మర్​లో ప్రయాణాలు పెట్టుకునే వారి కోసమే రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది . అదేంటంటే..?

వేసవి సీజనులో రద్దీని తట్టుకునేలా 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలోని పట్నా, దిల్లీ, విశాఖపట్నం, ముంబయి వంటి ప్రధాన కేంద్రాల మీదుగా ఈ రైళ్లను 6,369 ట్రిప్పులు నడపనున్నారు. గతేడాది 348 ప్రత్యేక రైళ్లతో మొత్తం కలిపి 4,599 ట్రిప్పులను రైల్వేశాఖ నడిపింది. ఈ ఏడాది అంతకంటే 1,770 ట్రిప్పులు అదనంగా నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్‌a, పట్నా – యశ్వంత్‌పుర్‌, విశాఖపట్నం – పూరి – హావ్‌డా తదితర మార్గాల్లో తిరుగుతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేర ప్రత్యేకరైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news