LIC: రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే… రూ.25 లక్షలు..!

-

ఈరోజుల్లో చాలా మంది వాళ్లకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా ఈ స్కీమ్స్ లో డబ్బులని పెడితే మంచిగా లాభాలు వస్తాయి. పైగా భవిష్యత్తు లో సమస్యలు ఏమి కూడా రావు. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఎల్ఐసీలో అన్ని వయసుల వారికి పాలసీలు వున్నాయి. తక్కువ పెట్టుబడితో కూడా అధిక లాభాలు పొందవచ్చు.

Life Insurance Corporation

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరు తో కొత్త పాలసీ ని తీసుకు వచ్చారు. రోజు రూ.45 ఆదా చేయడం ద్వారా పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి రూ.25 లక్షలు వస్తాయి. ఈ పాలసీ ద్వారా పాలసీదారుడు అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి జీవన్ ఆనంద్ పాలసీ తో వస్తుంది.

ఇది టర్మ్ పాలసీ లాగ ఉంటుంది. అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను కూడా ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. దీనిలో కనీసం లక్ష రూపాయలు పెట్టాలి. గరిష్ట పెట్టుబడి హామీ ఏదీ లేదు. ప్రతి నెలా దాదాపు రూ.1358 డిపాజిట్ చెయ్యాల్సి వుంది. దాని ద్వారా రూ.25 లక్షలు పొందవచ్చు. అంటే మీరు రోజుకు రూ.45 చొప్పున 35 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీకు రూ. 25 లక్షలు అందుతాయి. ఏటా పొదుపు చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు రూ.16,300 ఉంటుంది.

35 ఏళ్లు సేవ్ చేస్తే మొత్తం రూ.5,70,500 డిపాజిట్ అవుతుంది. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు రూ. 8.60 లక్షల రివిజన్ బోనస్, రూ. 11.50 లక్షల చివరి బోనస్ వస్తుంది. రెండుసార్లు బోనస్ ఇస్తారు. పాలసీ వ్యవధి తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి. అయితే ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండదు. కానీ ఇందులో నాలుగు రకాల ప్రయోజనాలు వున్నాయి. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ ప్రయోజనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news