వైసీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది – ఆర్ కృష్ణయ్య

-

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. నేడు విజయవాడలో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టులలో తొలిసారి బీసీలకు న్యాయం జరిగిందన్నారు. రోడ్లమీద కాదు పార్లమెంటులో బీసీల కోసం పోరాడాలని సీఎం జగన్ చెప్పారని.. అందుకే తనని పార్లమెంటుకి పంపించారని అన్నారు.

50% బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో తనని పోరాడమని చెప్పారని తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్ కి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏపీలో 60% పదవులు బీసీలకు దక్కడం మనకు గర్వకారణం అని కృష్ణయ్య వెల్లడించారు. మనకు రాజ్యాధికారం కల్పించిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ కృష్ణయ్య.

Read more RELATED
Recommended to you

Latest news