BREAKING : కేంద్ర మంత్రి అమిత్ షాకు సిపిఐ నారాయణ లేఖ

-

BREAKING : కేంద్ర మంత్రి అమిత్ షాకు సిపిఐ నారాయణ లేఖ రాశారు. విశాఖ పర్యటన సందర్భంగా అమిత్ షా, విశాఖ అరాచాలకు అడ్డంగా మారిందని… అమిత్‌ షా వచ్చిన మూడో రోజే ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ఈ లేఖలో ప్రస్తావించారు సిపిఐ నారాయణ. ఎంపి అనేక భూకుంభకోణాలకు పాల్పడ్డారని.. ఎంపి నివాసంలో మూడు రోజులు దుండగులు తిష్ట వేశారని ఫైర్‌ అయ్యారు.

ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంట్లో దుండగులు మకాం వేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని… ఎంపి కి, దుండగులకు మధ్య ఎన్నో సంబంధాలున్నాయని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సిపిఐ నారాయణ. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని… భవిష్యత్ లో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి… జాతీయ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలన్నారు. విశాఖ ప్రాంతం చాలా కీలకమైందని… విశాఖ లో మాఫియా పై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు సిపిఐ నారాయణ. ఎంపి ఎపిసోడ్ వ్యవహారం కేంద్ర హోంశాఖకే సవాలు… విశాఖ ఉనికికే ప్రమాదం ఉంది.. ఇంకా రాజధాని గా ఎలా అవుతుందని లేఖలో పేర్కొన్నారు సిపిఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news