వంగవీటి రంగా హత్య కేసును రీ ఓపెన్ చేయాలి – తోట చంద్రశేఖర్

-

వంగవీటి మోహనరంగా హత్యపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్ గాజుల రామారంలో వంగవీటి రంగా విగ్రహాన్ని వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రంగా హత్య కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రంగా సీఎం అభ్యర్థి అనే కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు తోటా చంద్రశేఖర్.

రంగాను హత్య చేసిన వారికి శిక్ష పడినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. కాగా ఎన్టీరామారావు ప్రభుత్వ హయాంలో వంగవీటి హత్య ఓ పెద్ద సంచలనం. 1988 డిసెంబర్ 26వ తేదీన హత్యకు గురయ్యారు రంగా. మాజీ మంత్రి హరీ రామ జోగయ్య తన ఆత్మకథ ద్వారా రంగా హత్య ఉదాంతాన్ని చర్చనీయాంశం చేశారు. దాదాపు 40 రోజుల పాటు ఏపీ అట్టుడికిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news