శ్రీవారి సేవలో కాబోయే వ‌రుడుతో స్టార్ హీరోయిన్‌..

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సినీనటి నయనతార దర్శించుకున్నారు. గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకొనున్నారు. ఈ క్రమంలో ఇవాళ వీరు కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి నయనతార తో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవటానికి పలువురు ఉత్సాహం చూపారు.

Read more RELATED
Recommended to you

Latest news