బాలీవుడ్ నటుడి ఫొటోతో రూ.500 నకిలీ నోట్లు కలకలం

-

దేశ వ్యాప్తంగా నకిలీ కరెన్సీ కలకలం రేపుతున్నాయి. కొందరు అక్రమార్కులు కావాలనే దొంగనోట్లు ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్నారు. దీంతో చిల్లర వ్యాపారులు చాలా నష్టోపోతున్నారు. దొంగనోట్ల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇస్పటికైనా ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుని దొంగనోట్లను మార్కెట్ నుంచి నిర్మూలించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

తాజాగా మరోసారి నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో కొందరు కేటుగాళ్లు నకిలీ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు. దానిపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు. నిందితులు ఈ ఫేక్ నోట్లతో 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా విషయం బయటకు వచ్చింది. నలుగురిని అరెస్టు చేసి, రూ.1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news