TV5 మూర్తి డైరెక్టర్ గా ప్రస్తుత రాజకీయాలపై బ్రహ్మాస్త్రమే “ప్రతినిధి 2” ?

-

గతంలో రాజకీయ అవినీతి పై సంధించిన అస్త్రంగా ప్రతినిధి సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో నారా రోహిత్ హీరోగా నటించి అందరినీ మెప్పించాడు. ఇక చాలా కాలం తర్వాత ఆ సినిమాకు కొనసాగింపుగా ఒక కొత్త కథను సిద్ధం చేశారట ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి… ఈ మాట అంటే ఎవ్వరికీ గుర్తు రాకపోవచ్చు మహా న్యూస్ మూర్తి లేదా TV5 మూర్తి అంటే అందరికీ అర్దమవుతుంది. ఈ సినిమా కథను మూర్తి నే స్వయంగా రెడీ చేశారట.. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక దీనిని ప్రతినిధి 2 గా తీయాలని ఫిక్స్ అయ్యి రోహిత్ ను కలిశారట. కథ వినగానే రోహిత్ ఒకే చెప్పడం జరిగిపోయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా త్వరగానే షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కథ పరంగా చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మిళితం చేసి ప్రభుత్వంపై బ్రహ్మాస్త్రంగా వదలనునట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

 

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాలంటే విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాకు మూర్తి డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news