జపాన్ ఓపెన్ 2023: క్వార్టర్స్ లో ముగిసిన “సాత్విక్ – చిరాగ్” జోడీ పోరాటం…

-

జపాన్ ఓపెన్ లో తెలుగు తేజం పి వి సింధు మొదటి రౌండ్ లోనే ఓటమి పాలవడంతో భారత్ పరువు అంతా సాత్విక్ మరియు చిరాగ్ ల జోడీ మీదనే పడింది. అందుకు తగినట్లే వీరిద్దరి జోడీ మంచి భాగస్వామ్యంతో వరుస మ్యాచ్ లలో గెలుస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో మాత్రం ప్రత్యర్థుల ముందు వీరి ఆటలు సాగలేదు. సాత్విక్ మరియు చిరాగ్ ల జంట ఒలింపిక్ ఛాంపియన్ లుగా నిలిచిన లీ యాంగ్ మరియు వాంగ్ లిన్ లతో పోరాడి ఓడిపోయారు.. మొదటి గేమ్ ను 15 – 21 తేడాతో కోల్పోగా, రెండవ రౌండ్ లో తేరుకుని ప్రత్యర్థికి కఠినమైన పోటీ ఇచ్చి రెండవ గేమ్ ను 25 – 23 తేడాతో సొంతం చేసుకున్నారు. ఇక నిర్ణయాత్మక చివరి గేమ్ లో ప్రత్యర్థులతో పోరాడి 16
– 21 తేడాతో ఓటమి పాలయ్యారు.

ఈ ఓటమితో వరుస విజయాలకు బ్రేకులు పడ్డాయి. ఈ ఓటమితో భారత్ కు కప్ తీసుకువస్తారన్న నమ్మకం కూడా పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news