టిడిపిలో బీసీలకు న్యాయం జరగదనడానికి నేనే ఉదాహరణ – బీదమస్తాన్ రావు

-

అభం,శుభం తెలియని అమర్‌నాథ్ సోదరుడితో అవాస్తవాలు మాట్లాడించారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. ఈ చర్య అత్యంత దుర్మార్గమన్నారు. వాస్తవాలు మాట్లాడితే తలలు ముక్కలు అవుతుందని చంద్రబాబు కుటుంబానికి నానుడి ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మించి అవాస్తవాలు లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక కుల సంఘాలను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వచ్చారని విమర్శించారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగదని చెప్పడానికి తానే ఉదాహరణ అని చెప్పారు. గతంలో నేను టీడీపీ లో ఉన్నప్పుడు ఎటువంటి
న్యాయం జరగలేదని.. చంద్రబాబు సొంత సామాజిక వర్గం నేతలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం చేస్తారన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు బీదమస్తాన్ రావు. టీడీపీ కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికీ సఫలం కావన్నారు. జగన్ తిరిగి సీఎం అయితే బీసీలకు కేంద్ర స్థాయిలో పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. వివిధ వినూత్న పథకాలతో జగన్ బీసీలకు న్యాయం చేసారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news