మిజోరాం సీఎంకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మణిపూర్ సీఎం !

-

మణిపూర్ రాష్ట్రంలో గత కొంతకాలంగా రెండు తెగల మధ్యన జరిగిన వివాదం రాష్ట్రము అంతటా ఎంతటి హిమసాత్మక ఘటనలు జరగడానికి కారణం అయిందో మనకు తెలిసిందే. ఈ విషయం గురించి దేశం అంతా ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కాగా తాజాగా మణిపూర్ సీఎం బీరేం సింగ్ మిజోరాం సీఎం జోరామ్ తంగాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మా రాష్ట్రంపై సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. మణిపూర్ హింసలో కుకీ అనే తెగ దారుణంగా ప్రభావితం అయింది. కాగా ఈ కుకీ వర్గానికి మద్దతుగా జరిగిన ఒక ర్యాలీ మిజోరాం లో జరుగగా, ఆ ర్యాలీ లో సీఎం జోరం తంగా హాజరయ్యారు. దీనితో ఆగ్రహం చెందిన బీరేం సింగ్ ఎవ్వరికీ మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు.

అక్రమంగా మా రాష్ట్రంలోకి వచ్చిన వారందరినీ తరిమేస్తాం అంటూ గట్టిగా జోరం తంగకు వార్నింగ్ ఇచ్చారు. ఒక గొడవ జరిగిన సమయంలో బాగా నష్టపోయిన వర్గానికి మద్దతుగా వేరే ప్రాంతంలో మద్దతు పలకడం పరోక్షముగా రెచ్చగొట్టడమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news