జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో RPF కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి

-

 జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో కాల్పులు కలకలం రేపాయి. రైలు మహరాష్ట్రలోని పాల్ఘర్‌ స్టేషన్‌ దాటి వెళ్లున్న సమయంలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ కుమార్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆర్పీఎఫ్‌ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం దహిసర్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 చేతన్ కుమార్​ అనే ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ తన సీనియర్, ఆర్​పీఎఫ్​ ఏఎస్​ఐ టికా రామ్​ మీనాను కదులుతున్న రైలులో కాల్చి చంపాడు. అనంతరం మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. గవర్నమెంట్​ రైల్వే పోలీస్, ఆర్​పీఎఫ్​ అధికారుల సహాయంతో నిందితుడిని మిరా రోడ్డు వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. అయితే చేతన్ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news