నేడు “I.N.D.I.A” కూటమి ఫ్లోర్ లీడర్ల భేటీ

-

నేడు ప్రతిపక్ష ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చీఫ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు.

మణిపూర్ అల్లర్ల విషయంలో జోక్యం చేసుకోవాలని, సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ హింసపై ప్రధాని అత్యవసరంగా పార్లమెంటులో ప్రసంగించేలా ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రపతిని కోరామన్నారు. అలాగే పునరావాస కేంద్రాలలో సరైన సదుపాయాలు లేవని తెలిపామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news