రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి ఫిర్యాదు చేస్తా – ఎంపీ కేశినేని నాని

-

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి ఎంపీ కేశినేని నాని. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేకపోతే రాష్ట్రం బాగుపడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులపై టిడిపి ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. పాలకులు ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదు అన్నారు. వైసిపి ప్రభుత్వం పై అన్ని వర్గాలలో పూర్తిగా వ్యతిరేకత పెరిగిపోయిందని అన్నారు కేశినేని నాని.

అందుకే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్తాన్ దేశం కూడా చివరకు శాంతి భద్రతలు లేకపోవడంతో బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు సైతం ట్రాన్స్ఫార్ల భయంతో వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news