ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రానికి అమిత్‌ షా

-

ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రానికి అమిత్‌షా రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ తన వ్యూహాలకు పదనుపెడుతోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేస్తోంది.

ఈ నెల 27న ఖమ్మంకు అమిత్ షా రానుండగా, అక్టోబర్ లో ప్రధాని పర్యటించేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మూడు బస్సు యాత్రలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ బస్సు యాత్రను అక్టోబర్ లో హైదరాబాద్ లో ముగించనున్నారు.

ఇక అటు స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26న కోటి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మంచిరేవుల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news