మహారాజ ట్రోఫీ 2023 ఫైనల్ : మనీష్ పాండే vs కరుణ్ నాయర్ !

-

గత 16 రోజులుగా కర్ణాటక లోని వేదికలపై మహారాజ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడగా చివరికి రెండు జట్లు మాత్రమే తుది సమరానికి చేరుకున్నాయి. టీం ఇండియా ప్లేయర్ మనీష్ పాండే సారధ్యంలోని హుబ్లీ టైగర్స్ మరియు కరుణ్ నాయర్ సారధ్యంలోని మైసూర్ వారియర్స్ లో ఈ రోజు సాయంత్రం 5 .30 గంటలకు జరగనున్న ఫైనల్ లో తలపడనున్నాయి. రెండు జట్లు సమతూకంతో కనిపిస్తున్నా ఈ రోజు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది. సెమీఫైనల్ 2 లో గుల్భర్గా జట్టుపై వీరోచిత సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ మరోసారి అదే విధంగా ఆడితే టైటిల్ మైసూర్ వారియర్స్ కు దక్కడంతో ఎటువంటి సందేహం లేదు.

ఇక మనీష్ పాండే జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము. సిసోడియా, శ్రీజిత్, పాండే, తాహ లతో బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది.. మరి ఈ రోజు టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది పిచ్ రిపోర్ట్.

Read more RELATED
Recommended to you

Latest news