మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌..తెరపైకి పూల రంగుడు సినిమా ఫైనాన్సియర్‌ !

-

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు లో నార్కోటిక్స్ అధికారుల విచారణ వేగవంతం చేసింది. సినిమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఢమరుకం, పూల రంగుడు, లవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమా కు ఫైనాన్సియర్ గా పని చేసిన వెంకట్ దీనికి మూల కారణం అని అధికారులు చెబుతున్నారు.

బాలాజీ అనే వ్యక్తిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల,మేహక్ అరెస్ట్ అయ్యారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు వెంకట్. అయితే.. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టింది నార్కోటిక్ బ్యూరో. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలు పై ఆరా తీసింది. వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించింది నార్కోటిక్ బ్యూరో.

Read more RELATED
Recommended to you

Latest news