ఏపీకి రావడానికి పాస్ పోర్టు, వీసా అప్లై చేసుకునే పరిస్థితి – పవన్ కళ్యాణ్

-

ఏపీకి రావడానికి పాస్ పోర్టు, వీసా అప్లై చేసుకునే పరిస్థితి ఉందటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ వస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి పాస్ పోర్టు, వీసా కావాల్సి వస్తుంది అని ఆనాడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు పవన్‌ కళ్యాణ్‌. కానీ తెలంగాణ ప్రజలు, నాయకులు అలా చేయలేదు. కానీ జగన్ మాత్రం ఆంధ్ర ప్రదేశ్‌కు రావడానికి పాస్ పోర్టు, వీసా అప్లై చేసుకునే పరిస్థితి తెచ్చాడని వెల్లడించారు పవన్ కళ్యాణ్.

pawan
pawan

జగన్ ది ధైర్యం అనుకుంటారని, కానీ అది పిచ్చ అని వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని, కేంద్రం ప్రత్యేక మానసిక వైద్యులను పంపించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలుగుదేశంతో ఎలా అధికారం పంచుకుందాం..? అది సీఎం స్థానమా..? లేక మంత్రులా..? ఇవన్నీ ఆలోచించే ముందు మనం గెలవాలి కదా..? అని అన్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news