సీతక్కను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్..ములుగు జిల్లాలో మరో మండలం ఏర్పాటు

-

ములుగు జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ములుగు జిల్లాలో మరో మండలాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న మల్లంపల్లిని ప్రత్యేక మండలం 331 గెజిట్ తో ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ సందర్భంగా జాతీయ రహదారి163 పై బాణాసంచి పేల్చి… తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మల్లంపల్లి గ్రామస్తులు.

Formation of another mandal in Mulugu district
Formation of another mandal in Mulugu district

మల్లంపల్లి మండల ఏర్పాటుతో మల్లంపల్లి ప్రజలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి. మల్లంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు మల్లంపల్లి ప్రజలు. మల్లంపల్లి మండల ఏర్పాటుకు సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు మల్లంపల్లి ప్రజలు. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆకాంక్ష మేరకు మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు చెప్పారు ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి.

Read more RELATED
Recommended to you

Latest news