తిరుమలలో కలకలం….టీటీడీ ఉచిత బస్సు మిస్సింగ్

-

తిరుమల బస్సు మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇవాళ తిరుమలలో ఉన్న టిటిడి ఉచిత బస్సు మిస్ అయింది. ఇవాళ ఉదయం 3 గంటలకు ఎలక్ట్రిక్‌ బస్సు జియన్ సి టోల్ గేట్‌ దాటినట్లు గుర్తించారు విజిలేన్స్ అధికారులు. గత వారం రోజులు క్రితం కూడా ఎలక్ట్రిక్ కారు కూడా మిస్సింగ్ అయిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంటిమిట్ట రామాలయం వద్ద కారును గుర్తించింది భధ్రతా సిబ్బంది.

TTD free bus missing
TTD free bus missing

ఇక కారు మిస్సింగ్ పై పోలిసులుకు పిర్యాదు చెయ్యకపోవడంతో దర్యాప్తు జరుగలేదు. ఇక ఇప్పుడు తిరుమల బస్సు మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇవాళ తిరుమలలో ఉన్న టిటిడి ఉచిత బస్సు మిస్ అయింది. ఎలక్ట్రిక్‌ బస్సులో జిపియస్ ద్వారా ట్రాక్ చేస్తూన్నారు అధికారులు. నాయుడుపేట వద్ద బస్సు లోకేషన్ ఉన్నట్లు గుర్తించారు. ఓ దొంగ ఈ బస్సును దొంగిలించినట్లు చెబుతున్నారు. నాయుడుపేట వద్ద బస్సు చార్జీంగ్ అయిపోవడంతో బస్సుని రోడ్డు ప్రక్కన నిలిపివేసి దొంగ పరారైనట్లు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news