తిరుమల శ్రీవారి సన్నిధిలో మళ్లీ చిరుత కలకలం..

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్. తిరుమలలో మళ్లీ చిరుత సంచారాన్ని అటవిశాఖ అధికారులు గుర్తించారు. టీటీడీ ఇఓ ఇంటి సమీపంలో చిరుత సంచారాన్ని ట్రాప్ కెమరాలు ద్వారా గుర్తించారు అటవిశాఖ అధికారులు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ఇక ఇవాళ్టి నుంచి రెండు రోజులు పాటు నడకదారిలో వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం పరిశీలన జరుపనుంది. నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు వున్న అవకాశాలను పరిశీలించనుంది వైల్డ్ లైఫ్ కమిటి. కమిటీ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చెయ్యనుంది కేంద్రం.

కాగా, ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున : ప్రారంభం కానున్నాయి. నిన్నటి వరకు తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అయితే.. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు నిన్నటి తో ముగిసాయి. దీంతో ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పున : ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news