జియోమార్ట్‌‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

-

మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. అయితే.. తాజాగా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది.

Dhoni as the brand ambassador of Geomart
Dhoni as the brand ambassador of Geomart

క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిలయన్స్ రిటైల్స్ కు చెందిన ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ తాజాగా ప్రకటించింది. ‘విశ్వసనీయతకు మారుపేరుగల వ్యక్తిని మా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాన్ మెట్రో ప్రాంతాల అమ్మకాలలో 60% వాటా కలిగి ఉన్నాం. ఈ నియామకం క్రమంగా వృద్ధికి దోహదపడుతుంది’ అని సీఈవో సందీప్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news