SHOCKING: ప్చ్… చెత్త షాట్ ఆడి సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ (85)

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా విజయం దిశగా దూసుకువెళుతోంది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన కె ఎల్ రాహుల్ ఇండియాను కోహ్లీ తో కలిసి ఓటమి కోరల్లోంచి బయట పడేశాడు. కోహ్లీ మరియు రాహుల్ లు నాలుగవ వికెట్ కు 165 పరుగులు జోడించారు. ఎంతో కష్టసాధ్యం అనుకున్న ఆస్ట్రేలియా బౌలర్లను కోహ్లీ మరియు రాహుల్ లు ఎంతో ఓపికతో పరుగుకు పరుగు జోడించి ఇండియాను సురక్షితమైన స్థాయిలో నిలిపారు.

కానీ మరో 33 పరుగులు చేస్తే గెలుస్తుంది అనుకున్న సమయంలో హాజిల్ వుడ్ బౌలింగ్ లో పుల్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీ పరుగుల తో ఉన్నప్పుడు అవుట్ అవడంతో సెంచరీ కి మరో 15 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news