తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అందులో మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు టిఆర్ఎస్ కు రాజీనామా జెసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన జనగామ స్టేషన్ ఘనపూర్ ఉప్పల్ నియోజకవర్గాల చెందిన ఎమ్మెల్యేలకు ఈసారి అధికార పార్టీలో సీటు దక్కలేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
నిన్న మొన్నటి వరకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి అక్కేస్తే దగ్గు అన్నట్టుగా వాడి వేడి కొనసాగింది. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరువురు ఒకటయ్యారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా ముత్తిరెడ్డి,మధ్య సయోద్య కుదిరింది. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సయోద్య కుదిర్చారు కేటీఆర్. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించామని.. ఆయనను గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్ కోరారు.