సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో నేడు కీలక విచారణ

-

సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో నేడు కీలక విచారణ జరుగనుంది. ఈ నెల 28 న సింగరేణి లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయింది కేంద్ర కార్మిక శాఖ. అయితే.. ఈ ఎన్నికల పై హై కోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది సింగరేణి యాజమాన్యం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతోంది సింగరేణి యాజమాన్యం.

A crucial hearing on the Singareni election in the High Court today
A crucial hearing on the Singareni election in the High Court today

గత ఏడాది నుంచి హై కోర్ట్ లో నే సింగరేణి ఎన్నిక వివాదం ఉంది. ఎన్నికల నిర్వహణ పై గడువు పొడగిస్తు ఉత్తర్వులు జారీ చేస్తోంది హై కోర్టు. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసిన హై కో ర్టు…జూన్ 23 న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల పై చీఫ్ కోర్ట్ లో అప్పీల్ చేసింది సింగరేణి యాజమాన్యం. ఇక నేడు సింగరేణి ఎన్నిక పై హై కోర్ట్ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news