BREAKING : నారా లోకేష్, బ్రాహ్మణిలకు సంకెళ్లు

-

నారా లోకేష్, బ్రాహ్మణిలకు సంకెళ్లు పడ్డాయి. అయితే నారా లోకేష్, బ్రాహ్మణిలకు సంకెళ్లు పడింది…పోలీసుల వల్ల కాదు.. వారికి వారే సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేసారు. అక్రమ అరెస్టు చేసి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్ లోనే చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Nara Lokesh agitation
Nara Lokesh agitation

జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినా, తప్పుడు నివేదికలు ఇస్తూ, అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్లు అని నినదిస్తూ నేను, బ్రాహ్మిణి హైదరాబాద్ నివాసంలో నిరసన తెలిపామన్నారు లోకేష్.

కోడిక‌త్తి నాట‌కానికి నిరుపేద ద‌ళిత యువ‌కుడు జ‌నిప‌ల్లి శ్రీనివాస‌రావుని బ‌లి చేశాడు సైకో జ‌గ‌న్ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. చివ‌రికి సాక్ష్యం చెప్ప‌డానికి కూడా రాకుండా ఐదేళ్లుగా జైలులో ద‌ళిత యువ‌కుడి జీవితాన్ని చీక‌ట్లో మ‌గ్గేలా చేసిన సైకో జ‌గ‌న్, చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌విస్తున్న శ్రీనుని..త‌ల్లిదండ్రులు చూడ‌కుండా పోలీసుల‌తో ఈడ్చేయించాడు. ఇది సైకోయిజం కాదా జ‌గ‌న్ రెడ్డీ! అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news