నాగర్ కర్నూల్‌ లో కాంగ్రెస్ ఎలా గెలుస్తదో చూస్తా – నాగం జనార్దన్ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల అయిన తర్వాత.. ఆ పార్టీ అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు. ఈ తరుణంలోనే..నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్ కర్నూల్‌ లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తానంటూ సవాల్‌ విసిరారు నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తున్నాడని నిప్పులు చెరిగారు.

nagam janardhan reddy
nagam janardhan reddy

ఎలా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాడని.. రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగం జనార్ధన్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడని..కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి నమ్మకద్రోహం చేసిన వ్యక్తులకు నాగర్కర్నూల్ టికెట్ ఇవ్వడం పెద్ద వింత అంటూ ఫైర్‌ అయ్యారు నాగం జనార్దన్ రెడ్డి. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటాడు కొడుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు ఇలాంటి వారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనం అంటూ ఆగ్రహించారు నాగం జనార్దన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news