కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. మృతులంతా ఏపీ వాసులే

-

కర్ణాటకలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర్​లో జాతీయ రహదారి నెం.44పై చిత్రావతి సమీపంలో.. ఆగి ఉన్న సిమెంట్​ లారీని టాటా సుమో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 18 మంది ఉండగా.. మిగతా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్​లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన గోరంట్ల వాసులను వెల్లడించారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారని చెప్పారు. 12 మంది మృతుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దట్టమైన పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news