రేపటి నుంచి భువనేశ్వరి రెండో విడత యాత్ర

-

Nara Bhuvaneswari : చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకు భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ రెండో విడత యాత్ర రేపు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఆముదాలవలస, ఎచ్చెర్ల, బొబ్బిలిలో ఆమె పర్యటించనున్నారు. ఇవాళ ఆమె రాజమండ్రి నుంచి విజయనగరం చేరుకుంటారు.

సాయంత్రం రాయగడ రైలు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో పరామర్శిస్తారు. ఇది ఇలా ఉండగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మద్యంతర బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. నిన్న ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును నేటికీ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండనుంది. తోలుత ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news