IND VS SL : నేటి మ్యాచ్ రోహిత్‌ కెరీర్‌లోనే స్పెషల్

-

నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ లోనే చాలా స్పెషల్. హిట్ మ్యాన్ ఈ వాంఖడే స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు ఆడుతూ పెరిగారు. దాదాపు 12 ఏళ్ల క్రితం 2011లో ఈ స్టేడియంలోనే భారత్, శ్రీలంక WC ఫైనల్ ఆడాయి. ఈ WCలో రోహిత్ కి చోటు దక్కలేదు. అప్పుడు రోహిత్ ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు అదే శ్రీలంక పై గెలిచి సెమీస్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news