వారం రోజుల్లో ప్రజల ముందుకు వస్తా : ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

-

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో హింసా రాజకీయానికి తావులేదంటూ ఖండించారు.

మరోవైపు ప్రభాకర్ రెడ్డి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భగవంతుడి దయ, నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు. తనను చూసేందుకు అభిమానులు ఎవరూ హైదరాబాద్‌ రావొద్దని సూచించారు. వారం రోజుల్లో నేనే నియోజకవర్గ ప్రజల ముందుకు వస్తానని.. మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news