పురంధేశ్వరి ఓ శకుని..ఏపీని సర్వ నాశనం చేసింది – విజయసాయి

-

టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పురంధేశ్వరి ఓ శకుని..ఏపీని సర్వ నాశనం చేసిందని ఆగ్రహించారు. పురంధరేశ్వరి, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పురంధేశ్వరి పై ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి అని మండిపడ్డారు విజయ సాయిరెడ్డి.

ఇప్పుడు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిదని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news